భారత్లోకి రానున్న యాపిల్ వాలెట్!
ఐఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్..
న్యూఢిల్లీ: అక్టోబరు 2026 నుంచి భారత మార్కెట్లోకి యాపిల్ వాలెట్ (Apple Wallet) సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ఆమోదం తెలిపింది.
మొదటి దశలో భాగంగా వీసా (Visa), మాస్టర్కార్డ్ (Mastercard) నెట్వర్క్లకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులను యాపిల్ వాలెట్ యాప్కు అనుసంధానించుకునే (Link) వెసులుబాటు కలగనుంది. ఈ సేవలు ప్రారంభమయ్యాక ఐఫోన్, యాపిల్ వాచ్ వినియోగదారులు కాంటాక్ట్లెస్ NFC (Near Field Communication) టెక్నాలజీ ద్వారా నేరుగా తమ డివైజ్ల నుంచే సురక్షితంగా చెల్లింపులు చేయవచ్చు. కార్డ్ వివరాలు స్టోర్ అవ్వకుండా 'టోకెనైజేషన్' (Tokenization) సాంకేతికతను ఉపయోగించడం వల్ల సైబర్ భద్రత మరింత మెరుగ్గా ఉంటుంది.