BREAKING
భక్తిశ్రద్ధలతో గంగమ్మ తల్లి తిరునాళ ఫ్రెంచ్ చేపల పడవ మునక.. ఇద్దరు సిబ్బంది గల్లంతు వెస్ట్ బ్యాంక్‌లో యూదు సెటిలర్ల దాడులను తీవ్రంగా ఖండించిన నెతన్యాహు ఈయూలో చేరేందుకు చర్చల పునఃప్రారంభాన్ని తిరస్కరించిన ఐస్‌లాండ్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుంది నేపాల్‌లో ముమ్మరంగా వరద సహాయక చర్యలు పర్యాటకాన్ని ఆదుకోవాలని నటి మనీషా కొయిరాలా విజ్ఞప్తి నేపాల్ వరద బాధితులకు సద్గురు ఓదార్పు ఢిల్లీలో 95 ఎకరాల భూమి పునరుద్ధరణ మధ్య వయస్సులోని మహిళలు ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి    – మిసెస్‌ ఇండియా యూఎస్‌ఏ డాక్టర్‌ మాలిని సందడి ఉజ్బెకిస్తాన్ పర్యటన ముగించుకుని కిర్గిజ్‌స్థాన్‌కు ప్రయాణమైన ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రరూపం దాల్చిన మందాకిని హిమాచల్ సరిహద్దుల్లో సైనిక సంసిద్ధత సమీక్ష భారత్‌లోకి రానున్న యాపిల్ వాలెట్! హుజురాబాద్ లో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు ---300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

పర్యాటకాన్ని ఆదుకోవాలని నటి మనీషా కొయిరాలా విజ్ఞప్తి

Select Suryaa Now
పర్యాటకాన్ని ఆదుకోవాలని నటి మనీషా కొయిరాలా విజ్ఞప్తి

కాఠ్మండు, ఆగస్టు 30: ఆకస్మిక వరదలతో కష్టాల్లో ఉన్న నేపాల్‌కు అండగా నిలిచేందుకు ఆధ్యాత్మిక గురువు సద్గురు నేతృత్వంలో నిర్వహించిన 'నేపాల్‌కు సంఘీభావం' (In Solidarity with Nepal) కార్యక్రమంలో ప్రముఖ నటి మనీషా కొయిరాలా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాలకు భూతాపమే (గ్లోబల్ వార్మింగ్) ప్రధాన కారణమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు, భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు తలెత్తకుండా నివారించేందుకు భారత్, చైనా, నేపాల్ వంటి పొరుగు దేశాలు కలిసికట్టుగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
నేపాల్ అంటే కేవలం 'విపత్తుల దేశం' అనే ముద్ర పడకూడదని ఆమె ఆకాంక్షించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల జీవనోపాధికి పర్యాటక రంగమే ఊపిరి లాంటిదని... అంతర్జాతీయ పర్యాటకులు నేపాల్ పర్యటనను కొనసాగించడం ద్వారా దేశాన్ని ఆదుకోవాలని కోరారు.

కష్టకాలంలో అంతర్జాతీయ సమాజం చూపుతున్న ప్రేమ, మద్దతు ఇలాగే కొనసాగాలని, ప్రతి ఒక్కరూ బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు రావలసిందిగా మనీషా కొయిరాలా విజ్ఞప్తి చేశారు.