andhrapradesh
భక్తిశ్రద్ధలతో గంగమ్మ తల్లి తిరునాళ
Andhrapradesh
30 Aug 2026
56 views
By సూర్య ప్రతినిధి
Updated : 30 Aug 2026 20:38 IST
Select Suryaa Now
పామూరు, మేజర్ న్యూస్: మండలంలోని వగ్గంపల్లి గ్రామంలో గంగమ్మ తల్లి 17వ తిరునాళ్ల పసుపు కుంకుమ శ్రావణమాస తిరునాళ్ల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించగా, ఆదివారం గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. తప్పెట్ల మేళతాళాలు, నిండుబిందెలతో మహిళలు సందడి చేశారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి, మంగళహారతులు సమర్పించారు. అనంతరం దేవస్థానం వద్ద పొంగళ్ల కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.మధ్యాహ్నం అమ్మవారి భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహక వ్యవస్థాపక ధర్మకర్త జాజుల గురవమ్మ ఆధ్వర్యంలో, ఆలయ కార్యనిర్వాహక సేవకులు జాజుల మాల్యాద్రి–మల్లేశ్వరి దంపతుల సహకారంతో పాటు గ్రామ పెద్దల సహకారంతో అన్నదానం చేపట్టారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, శ్రావణమాసం మహిళలకు ఎంతో ప్రాధాన్యమైన మాసమని, ఈ మాసంలో అమ్మవారి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంటా రమణయ్య, వెంకట నరసింహ, జంబు జయరాములు, డేగ నాగరాజు, జంబు వేణు, జంబు కృష్ణ, సీతనబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.