BREAKING
భక్తిశ్రద్ధలతో గంగమ్మ తల్లి తిరునాళ ఫ్రెంచ్ చేపల పడవ మునక.. ఇద్దరు సిబ్బంది గల్లంతు వెస్ట్ బ్యాంక్‌లో యూదు సెటిలర్ల దాడులను తీవ్రంగా ఖండించిన నెతన్యాహు ఈయూలో చేరేందుకు చర్చల పునఃప్రారంభాన్ని తిరస్కరించిన ఐస్‌లాండ్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుంది నేపాల్‌లో ముమ్మరంగా వరద సహాయక చర్యలు పర్యాటకాన్ని ఆదుకోవాలని నటి మనీషా కొయిరాలా విజ్ఞప్తి నేపాల్ వరద బాధితులకు సద్గురు ఓదార్పు ఢిల్లీలో 95 ఎకరాల భూమి పునరుద్ధరణ మధ్య వయస్సులోని మహిళలు ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి    – మిసెస్‌ ఇండియా యూఎస్‌ఏ డాక్టర్‌ మాలిని సందడి ఉజ్బెకిస్తాన్ పర్యటన ముగించుకుని కిర్గిజ్‌స్థాన్‌కు ప్రయాణమైన ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రరూపం దాల్చిన మందాకిని హిమాచల్ సరిహద్దుల్లో సైనిక సంసిద్ధత సమీక్ష భారత్‌లోకి రానున్న యాపిల్ వాలెట్! హుజురాబాద్ లో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు ---300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

నేపాల్ వరద బాధితులకు సద్గురు ఓదార్పు

Select Suryaa Now
నేపాల్ వరద బాధితులకు సద్గురు ఓదార్పు

'విపత్తుల వెనుక భౌతిక కారణాలే తప్ప అతీంద్రియ శక్తి లేదు'
కాఠ్మండు, ఆగస్టు 30: ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతున్న నేపాల్‌కు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు తన గాఢ సానుభూతిని, సంఘీభావాన్ని ప్రకటించారు. 'నేపాల్‌తో సంఘీభావం' (In Solidarity with Nepal) అనే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, విపత్తు వేళ ప్రజలకు ధైర్యం చెప్పారు.

గత 20 ఏళ్లుగా నేపాల్ తన హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని ఈ సందర్భంగా సద్గురు గుర్తుచేసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దైవిక కారణాలు లేదా అతీంద్రియ శక్తులను వెతకడం సహజమని, అయితే భౌతిక ప్రపంచంలో జరిగే ప్రతీ సంఘటన భౌతిక నియమాల ప్రకారమే జరుగుతుందని శాస్త్రీయ దృక్పథాన్ని స్పష్టం చేశారు.

గత దశాబ్ద కాలంగా నేపాల్ ప్రజలు వరుసగా ఎన్నో విపత్తులను, కష్టాలను ఎదుర్కొన్నారని... ప్రతీసారి ఆపదలను ధైర్యంగా తట్టుకుని తిరిగి కోలుకున్నారని కొనియాడారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మళ్లీ పుంజుకునే నేపాల్ ప్రజల సంకల్పం, నిబద్ధత అభినందనీయమని సద్గురు పేర్కొన్నారు.