ఉత్తరప్రదేశ్లో ఉగ్రరూపం దాల్చిన మందాకిని
చిత్రకూట్లో వరద ముప్పు.. హనుమాన్ ధార వంతెన ప్రవాహంలో కొట్టుకువేత
లక్నో/చిత్రకూట్, ఆగస్టు 30: ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలో మందాకిని నది ఉగ్రరూపం దాల్చడంతో తీవ్ర వరద పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఈ భయానక వరదల ఉధృతికి హనుమాన్ ధరకు వెళ్లే ప్రధాన వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాంతానికి రవాణా సౌకర్యం నిలిచిపోయి, స్థానిక ప్రజలు మరియు భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రసిద్ధ రామ్ఘాట్ సహా పలు దిగువ ప్రాంతాలు నీట మునిగాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. పరిస్థితిని యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోంది.