BREAKING
నేపాల్‌లో ముమ్మరంగా వరద సహాయక చర్యలు పర్యాటకాన్ని ఆదుకోవాలని నటి మనీషా కొయిరాలా విజ్ఞప్తి నేపాల్ వరద బాధితులకు సద్గురు ఓదార్పు ఢిల్లీలో 95 ఎకరాల భూమి పునరుద్ధరణ మధ్య వయస్సులోని మహిళలు ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి    – మిసెస్‌ ఇండియా యూఎస్‌ఏ డాక్టర్‌ మాలిని సందడి ఉజ్బెకిస్తాన్ పర్యటన ముగించుకుని కిర్గిజ్‌స్థాన్‌కు ప్రయాణమైన ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రరూపం దాల్చిన మందాకిని హిమాచల్ సరిహద్దుల్లో సైనిక సంసిద్ధత సమీక్ష భారత్‌లోకి రానున్న యాపిల్ వాలెట్! హుజురాబాద్ లో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు ---300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. రేపటితో డెడ్‌లైన్ ముగింపు! స్టేడియం కాదు.. క్రికెట్ వరల్డ్! హైదరాబాద్‌లో 100 ఎకరాల భారీ ప్లాన్ స్విట్జర్లాండ్‌లో రేవ్ పార్టీలో కాల్పులు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బాధితులకు న్యాయం చేయాలి "ముస్లింలు లేని భారత్‌ను కోరుకునేవారు హిందువులే కారు"

ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రరూపం దాల్చిన మందాకిని

Select Suryaa Now
ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రరూపం దాల్చిన మందాకిని


చిత్రకూట్‌లో వరద ముప్పు.. హనుమాన్ ధార వంతెన ప్రవాహంలో కొట్టుకువేత
లక్నో/చిత్రకూట్, ఆగస్టు 30: ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో మందాకిని నది ఉగ్రరూపం దాల్చడంతో తీవ్ర వరద పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఈ భయానక వరదల ఉధృతికి హనుమాన్ ధరకు వెళ్లే ప్రధాన వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాంతానికి రవాణా సౌకర్యం నిలిచిపోయి, స్థానిక ప్రజలు మరియు భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రసిద్ధ రామ్‌ఘాట్ సహా పలు దిగువ ప్రాంతాలు నీట మునిగాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. పరిస్థితిని యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోంది.