ఇంటింటికీ టీడీపీ సంక్షేమంపై అవగాహన
పామూరు , మేజర్ న్యూస్ : కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం పామూరు మండలంలోని బొట్లగూడూరు పంచాయతీలోని అపమాంబాపురంలో మంగళవారం రాష్ట్ర టీడీపీ విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్చౌదరి పాల్గొని ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నాదెళ్ల ప్రభాకర్, కోటపాటి రాజా, పారా జనార్ధన్, చిమ్మిలి వెంకటకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.