వేములవాడ రాజన్న లడ్డూ ప్రసాదంలో పురుగు
సూర్య వేములవాడ రురల్
వేములవాడ రాజన్న ఆలయ లడ్డూ ప్రసాదంలో పురుగు కనిపించిందని భక్తుడు ఆందోళన వ్యక్తం చేశాడు. సిరిసిల్లకు చెందిన గుజ్జుల సంతోశ్కుమార్ సోమవారం స్వామివారి దర్శనం అనంతరం లడ్డూ కొనుగోలు చేశారు. తినే సమయంలో పురుగు కనిపించిందని ఆయన తెలిపారు. ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా స్పందించలేదన్నారు. ఘటనపై విచారణ చేపట్టి, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.