BREAKING
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ టఫ్.. హెల్మెట్, సీట్‌బెల్ట్ లేకుంటే రూ.1,000 ఫైన్! పోలీస్ వెల్ఫేర్ సంఘం నూతన కమిటీకి జిల్లా ఎస్పీ ఘన సన్మానం TG EAPCET ఫార్మసీ కౌన్సెలింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 12 నుంచే రిజిస్ట్రేషన్! జివో 97ను తక్షణమే రద్దు చేయాలి తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచే వర్షాకాల సమావేశాలు! కొత్త మున్సిపల్ చట్టంపై ఉత్కంఠ సిసి రోడ్ పనులను పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్ బీజేపీ ఆధ్వర్యంలో 22A భూ సమస్యలపై నిరసన దీక్ష నర్సాపూర్ పట్టణంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తా ప్రభుత్వ పాఠశాలలో నోట్‌బుక్స్, స్టేషనరీ కిట్ల పంపిణీ హైదరాబాద్‌లో గోల్ఫ్ టోర్నమెంట్‌కు తెరలేచింది.. నేటి నుంచే తెలంగాణ గోల్కొండ మాస్టర్స్.. రూ.1 కోటి కోసం స్టార్ గోల్ఫర్ల పోటీ! కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరశంఖం బిఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారంపై కాంగ్రెస్ మీడియా సమావేశం రేవంత్ సర్కార్‌కు 1000 రోజులు.. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హీట్! తిమ్మాజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ వెండి ధరలకు స్వల్ప బ్రేక్.. సెప్టెంబర్ 1న కిలో వెండి రేటు ఎంతంటే? తెలంగాణ, ఏపీలో తాజా ధరలు!

బీజేపీ ఆధ్వర్యంలో 22A భూ సమస్యలపై నిరసన దీక్ష

Select Suryaa Now
బీజేపీ ఆధ్వర్యంలో 22A భూ సమస్యలపై నిరసన దీక్ష

బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్
నర్సాపూర్: భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ అసెంబ్లీ కార్యాలయంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్  ఆధ్వర్యంలో 2వ  తేదీ బుధవారం నాడు బస్టాండ్ ఆపోజిట్ మెయిన్ రోడ్ పై 22ఎ భూ సమస్యలపై బీజేపీ మెదక్ జిల్లా శాఖ భూములను కాపాడేందుకు భూములను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన దీక్ష చేపట్టడం జరగనున్న సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.

జిల్లా అధ్యక్షుల మాట్లాడుతూ 22ఎ పేరుతో సామాన్య ప్రజల తమ సొంత భూములను అమ్ముకోలేక రిజిస్ట్రేషన్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్దోషులైనా భూయాజమానులకు న్యాయం చేయాలి. తప్పుగా 22ఎలో చేరిన భూములను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించడం జరిగింది.

ఈ నిరసన దీక్షకు రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు గారు కేంద్ర మంత్రివర్యులు మరియు ఎంపీలు ముఖ్య అతిథులుగా రావడం జరుగుతుంది. ప్రతి మండలం నుండి రైతులను పెద్ద ఎత్తున ఈ దీక్షలో పాల్గొనవలసిందిగా కోరడం జరిగింది. మెదక్ జిల్లా నాయకులు మండల అధ్యక్షులు మోర్చాల అధ్యక్షులు సర్పంచులు కౌన్సిలర్లు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసని సురేష్ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు రమేష్ గౌడ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్ మోర్చాలా అధ్యక్షులు సత్యనారాయణ రాములు నాయక్ మండల అధ్యక్షులు నీలి నగేష్ ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు గుండం శంకర్ మహిళా మోర్చా నాయకులు మౌనిక ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు నగేష్ గౌడ్ బీజేవైఎం  ప్రేమ్ అనీల్ మైనారిటీ మోర్చా జిల్లా జీఎస్ గౌస్ పాషా బీజేపీ నాయకులు కృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది.