BREAKING
జివో 97ను తక్షణమే రద్దు చేయాలి తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచే వర్షాకాల సమావేశాలు! కొత్త మున్సిపల్ చట్టంపై ఉత్కంఠ సిసి రోడ్ పనులను పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్ బీజేపీ ఆధ్వర్యంలో 22A భూ సమస్యలపై నిరసన దీక్ష నర్సాపూర్ పట్టణంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తా ప్రభుత్వ పాఠశాలలో నోట్‌బుక్స్, స్టేషనరీ కిట్ల పంపిణీ హైదరాబాద్‌లో గోల్ఫ్ టోర్నమెంట్‌కు తెరలేచింది.. నేటి నుంచే తెలంగాణ గోల్కొండ మాస్టర్స్.. రూ.1 కోటి కోసం స్టార్ గోల్ఫర్ల పోటీ! కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరశంఖం బిఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారంపై కాంగ్రెస్ మీడియా సమావేశం రేవంత్ సర్కార్‌కు 1000 రోజులు.. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హీట్! తిమ్మాజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ వెండి ధరలకు స్వల్ప బ్రేక్.. సెప్టెంబర్ 1న కిలో వెండి రేటు ఎంతంటే? తెలంగాణ, ఏపీలో తాజా ధరలు! బంగారం ధరలకు బ్రేక్.. సెప్టెంబర్ 1న తులం కాదు 10 గ్రాముల రేటు ఎంతంటే? తెలంగాణ, ఏపీలో తాజా ధరలు ఇవే! ఎరువుల దందా పై విజిలెన్స్ కొరడా..! రైతులకు కొండంత అభయం

తిమ్మాజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

Select Suryaa Now
తిమ్మాజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
తిమ్మాజిపేట (నాగర్ కర్నూల్): నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో స్మార్ట్ రేషన్ కార్డులు మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ప్రయోజనాలు చేకూరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు చేతికి అందడంతో లబ్ధిదారులు, స్థానిక ప్రజలు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.

ఈ పంపిణీ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిలుక వివేక్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, మల్లయ్య గౌడ్‌లతో పాటు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.