BREAKING
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ టఫ్.. హెల్మెట్, సీట్‌బెల్ట్ లేకుంటే రూ.1,000 ఫైన్! పోలీస్ వెల్ఫేర్ సంఘం నూతన కమిటీకి జిల్లా ఎస్పీ ఘన సన్మానం TG EAPCET ఫార్మసీ కౌన్సెలింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 12 నుంచే రిజిస్ట్రేషన్! జివో 97ను తక్షణమే రద్దు చేయాలి తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచే వర్షాకాల సమావేశాలు! కొత్త మున్సిపల్ చట్టంపై ఉత్కంఠ సిసి రోడ్ పనులను పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్ బీజేపీ ఆధ్వర్యంలో 22A భూ సమస్యలపై నిరసన దీక్ష నర్సాపూర్ పట్టణంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తా ప్రభుత్వ పాఠశాలలో నోట్‌బుక్స్, స్టేషనరీ కిట్ల పంపిణీ హైదరాబాద్‌లో గోల్ఫ్ టోర్నమెంట్‌కు తెరలేచింది.. నేటి నుంచే తెలంగాణ గోల్కొండ మాస్టర్స్.. రూ.1 కోటి కోసం స్టార్ గోల్ఫర్ల పోటీ! కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరశంఖం బిఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారంపై కాంగ్రెస్ మీడియా సమావేశం రేవంత్ సర్కార్‌కు 1000 రోజులు.. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హీట్! తిమ్మాజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ వెండి ధరలకు స్వల్ప బ్రేక్.. సెప్టెంబర్ 1న కిలో వెండి రేటు ఎంతంటే? తెలంగాణ, ఏపీలో తాజా ధరలు!

జివో 97ను తక్షణమే రద్దు చేయాలి

Select Suryaa Now
జివో 97ను తక్షణమే రద్దు చేయాలి

బీఆర్ఎస్ కేవీ నేత యాద క్రాంతి హెచ్చరిక
హైదరాబాద్: బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు, హైదరాబాద్ జిల్లా నాయకుడు యాద క్రాంతి ఆధ్వర్యంలో ‘ప్రజావాణి’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వివాదాస్పద జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, గత కొంతకాలంగా ఆందోళన బాట పట్టిన పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్వీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ సందర్భంగా యాద క్రాంతి మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకొచ్చిన స్కిల్ యూనివర్సిటీ ప్రయోగానికి విద్యార్థుల నుంచి ఆదరణ కరువైందని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు గడుస్తున్నా స్కిల్ యూనివర్సిటీలో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోకపోవడాన్ని తట్టుకోలేక, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును బలితీసుకునేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణమే జీవో 97ను వెనక్కి తీసుకోకపోతే, విద్యారంగంపై అవగాహన లేని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు విశాల్, ప్రశాంత్, నితీష్, నవీన్, కిరణ్, బంటి తదితరులు పాల్గొన్నారు.