BREAKING
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ టఫ్.. హెల్మెట్, సీట్‌బెల్ట్ లేకుంటే రూ.1,000 ఫైన్! పోలీస్ వెల్ఫేర్ సంఘం నూతన కమిటీకి జిల్లా ఎస్పీ ఘన సన్మానం TG EAPCET ఫార్మసీ కౌన్సెలింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 12 నుంచే రిజిస్ట్రేషన్! జివో 97ను తక్షణమే రద్దు చేయాలి తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచే వర్షాకాల సమావేశాలు! కొత్త మున్సిపల్ చట్టంపై ఉత్కంఠ సిసి రోడ్ పనులను పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్ బీజేపీ ఆధ్వర్యంలో 22A భూ సమస్యలపై నిరసన దీక్ష నర్సాపూర్ పట్టణంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తా ప్రభుత్వ పాఠశాలలో నోట్‌బుక్స్, స్టేషనరీ కిట్ల పంపిణీ హైదరాబాద్‌లో గోల్ఫ్ టోర్నమెంట్‌కు తెరలేచింది.. నేటి నుంచే తెలంగాణ గోల్కొండ మాస్టర్స్.. రూ.1 కోటి కోసం స్టార్ గోల్ఫర్ల పోటీ! కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరశంఖం బిఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారంపై కాంగ్రెస్ మీడియా సమావేశం రేవంత్ సర్కార్‌కు 1000 రోజులు.. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హీట్! తిమ్మాజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ వెండి ధరలకు స్వల్ప బ్రేక్.. సెప్టెంబర్ 1న కిలో వెండి రేటు ఎంతంటే? తెలంగాణ, ఏపీలో తాజా ధరలు!

పోలీస్ వెల్ఫేర్ సంఘం నూతన కమిటీకి జిల్లా ఎస్పీ ఘన సన్మానం

Select Suryaa Now
పోలీస్ వెల్ఫేర్ సంఘం నూతన కమిటీకి జిల్లా ఎస్పీ ఘన సన్మానం

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ వెల్ఫేర్ సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కమిటీ సభ్యులను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జి. పాటిల్ ఘనంగా సన్మానించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నూతన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోలీస్ వెల్ఫేర్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా హెడ్ కానిస్టేబుల్ చిన్ను నాయక్, ఉపాధ్యక్షులుగా నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి, తాడూర్ ఎస్సై రాములు ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సిబ్బంది సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా నూతన కమిటీ పనిచేయాలని సూచించారు. పోలీస్ శాఖలోని ప్రతీ ఒక్కరికీ న్యాయం జరిగేలా అందరినీ కలుపుకొని సహోదర భావంతో ముందుకు సాగాలని కోరారు. నాగర్‌కర్నూల్ పోలీస్ వెల్ఫేర్ సంఘానికి రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు వచ్చేలా బాధ్యతాయుతంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.