తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ - ప్రభుత్వ స్కూల్ లో చదివితే ఉచిత టిఫిన్ + పాలు - నవంబర్ 15 నుంచి 33 జిల్లాల్లో అమలు - మెనూలో రాగి జావ!
తెలంగాణలో చదువుకునే పిల్లలకు అదిరిపోయే శుభవార్త! ఇకపై ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే ప్రతి ఒక్కరికీ ఉచితంగా అల్పాహారం పెట్టబోతున్నారు.ఈ సూపర్ పథకాన్ని నవంబర్ 15 లోపు 33 జిల్లాల్లో పూర్తిగా అమలు చేయాలని రేవంత్ సర్కార్ టార్గెట్ పెట్టింది. ఉదయాన్నే ఆకలితో బడికి వచ్చే పిల్లల కష్టాలకు ఇక చెక్ పెట్టినట్లే.ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే...
ఇప్పటికే 9 ప్రాంతాల్లోని సెంట్రల్ కిచెన్ల ద్వారా దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం లబ్ధి పొందుతున్నారు.మెనూలో ఏముంది?
పిల్లల ఆరోగ్యం కోసం ప్రభుత్వం స్పెషల్ మెనూ రెడీ చేసింది - వారంలో 3 రోజులు స్వచ్ఛమైన పాలు, మరో 3 రోజులు బలవర్ధకమైన రాగి జావ.ఎంత ఖర్చు పెడుతున్నారు?
ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.299 కోట్లు ఖర్చు చేసి 39 కొత్త భారీ వంటశాలలు నిర్మిస్తోంది. నార్సింగి, ఉప్పల్, సంగారెడ్డి, వరంగల్, హనుమకొండ లాంటి చోట్ల కిచెన్లు ఇప్పటికే రెడీ అయ్యాయి.