అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నాయకుడు ముందుండాలి
అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నాయకుడు ముందుండాలి
గీతం విద్యార్థులకు నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు సూచన.
పటాన్ చెరు: అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నాయకుడు ఎల్లప్పుడూ ముందుండాలని కమోడోర్ ఎం. జితేంద్రన్ వీఎస్ఎం అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో కమోడోర్ బి.ఆర్. రాజుతో కలిసి విద్యార్థులకు నాయకత్వం, ఇంజనీరింగ్పై అవగాహన కల్పించారు.ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణ అనుభవాలను జితేంద్రన్ వివరించగా, బి.ఆర్. రాజు 1965 యుద్ధ సమయంలో తన నావికాదళ అనుభవాలను పంచుకున్నారు. విద్యార్థులు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.