బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండించిన కరణం ప్రహ్లాద్ రావు
కుల్కచర్ల: బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్కు చెందిన వ్యక్తులు దాడి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కరణం ప్రహ్లాద్ రావు తీవ్రంగా ఖండించారు. మంగళవారం కుల్కచర్ల బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు, భిన్నాభిప్రాయాలు సహజమేనని, కానీ పార్టీ కార్యాలయాలపై దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. దాడికి బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులతో బీజేపీ గొంతును నొక్కలేరని, బెదిరింపులకు కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఘనపూర్ వెంకయ్య గౌడ్, డాక్టర్ జానకిరామ్, గాదె మహిపాల్, సౌమ్యారెడ్డి, వర్వాళ్ల అంజిలయ్య, బ్యాగారి శ్రీనివాస్, గడుసు మహిపాల్, సురేందర్ గౌడ్, బిజ్జారం రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.