మూడు చింతలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించండి
మంత్రి శ్రీధర్ బాబును కోరిన ఎంసీ పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్
శామీర్ పేట,మేజర్ న్యూస్ (సెప్టెంబర్01)
నూతనంగా ఏర్పడిన మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కి జిల్లా ఖనిజ అభివృద్ధి (గనులు) సంస్థ నుండి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మంగళవారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్ కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లో నిధులు లేక ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మున్సిపాలిటీలో నిధుల కొరత అధికంగా ఉండడంతో మునిసిపల్ సాధారణ నిధులు జీతాలకే సరిపోవడం లేదని, కావున మున్సిపాలిటీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని,ప్రజలకు మౌలిక సదుపాయాలు సీసీ రోడ్లు,డ్రైనేజ్, తాగునీరు, వీధిదీపాల అభివృద్ధి,నిర్వహణకు మున్సిపాలిటీలోని 24 వార్డుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజాపాలన భాగంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా ఖనిజ అభివృద్ధి (గనులు) సంస్థ నుండి నిధులు కేటాయించాలని మంత్రి శ్రీధర్ బాబును కోరారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.