BREAKING
పాలకుర్తి నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన భరత్ సుమన్ మూడు చింతలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించండి ఉజ్బెకిస్తాన్ ప్రధాని అబ్దుల్లా అరిపోవ్‌కు 'మార్బుల్ ఇన్‌లే ప్లేట్' బహుకరించిన ప్రధాని మోదీ! కిర్గిజ్ అధ్యక్షుడికి 'మహాభారతం' 10 సంపుటాలు కిర్గిజ్‌స్థాన్ అధ్యక్షుడికి 'లడఖీ త్సుగ్-దుల్' దుప్పటి బహుకరించిన ప్రధాని మోదీ! అడిల్‌బెక్ కసిమాలియేవ్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక కానుక! సెప్టెంబర్ ఈవెంట్‌లో Apple బాంబ్.. iPhone 18 Foldతో చరిత్ర సృష్టించిందా? అధ్యక్షుడు షవ్‌కత్ మీర్జియోయెవ్‌కు గంధపు చెక్క 'శత తంత్రి వీణ' బహుకరించిన ప్రధాని మోదీ! ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడికి ప్రధాని ప్రత్యేక కానుక టైమ్స్ స్క్వేర్‌లో కత్తులతో వీరంగం అక్టోబర్ 2న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ గ్రాండ్ రిలీజ్.. ఫహాద్ ఫాజిల్ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు! ఇరుముడి జోరు చూస్తే రూ.300 కోట్లు ఖాయమేనా? ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్! పేదలకు వైద్య సేవలే లక్ష్యం బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి డేటా సెంటర్ రంగానికి 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

మూడు చింతలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించండి

Select Suryaa Now
మూడు చింతలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించండి

మంత్రి శ్రీధర్ బాబును కోరిన ఎంసీ పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్

శామీర్ పేట,మేజర్ న్యూస్ (సెప్టెంబర్01)

నూతనంగా ఏర్పడిన మూడు చింతలపల్లి  మున్సిపాలిటీ కి జిల్లా ఖనిజ అభివృద్ధి (గనులు) సంస్థ నుండి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మంగళవారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్ కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లో నిధులు లేక  ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మున్సిపాలిటీలో నిధుల కొరత అధికంగా ఉండడంతో మునిసిపల్ సాధారణ నిధులు జీతాలకే సరిపోవడం లేదని, కావున మున్సిపాలిటీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని,ప్రజలకు మౌలిక సదుపాయాలు సీసీ రోడ్లు,డ్రైనేజ్, తాగునీరు, వీధిదీపాల అభివృద్ధి,నిర్వహణకు మున్సిపాలిటీలోని 24 వార్డుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజాపాలన భాగంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా ఖనిజ అభివృద్ధి (గనులు) సంస్థ నుండి నిధులు కేటాయించాలని మంత్రి శ్రీధర్ బాబును కోరారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.