పేదలకు వైద్య సేవలే లక్ష్యం
అయ్యాలూరివారిపల్లిలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ మల్లికార్జున రెడ్డి
పామూరు (సి ఎస్ పురం), పేద, గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పామూరు రవణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సి ఎస్ పురం మండలంలోని అయ్యాలూరివారిపల్లిలో 42వ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.శిబిరంలో ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న గ్రామస్తులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పేదలకు వైద్య సేవలు అందించడమే తమ సేవా సంకల్పమని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.