BREAKING
ఇరుముడి జోరు చూస్తే రూ.300 కోట్లు ఖాయమేనా? ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్! పేదలకు వైద్య సేవలే లక్ష్యం బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి డేటా సెంటర్ రంగానికి 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పశ్చిమ బెంగాల్‌లో తగ్గిన డెంగ్యూ తీవ్రత సిబిఐ, ఈడీలను భాజపా దుర్వినియోగం చేస్తోంది బాంబే ఆసుపత్రిలో అన్నా హజారే నేపాల్ సైన్యంతో చేయి కలిపిన భారతీయ సహాయక బృందం! అసెంబ్లీ నియమాలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉల్లంఘించారు వరుసగా చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు స్వదేశీకరణ, ప్రపంచ పోటీతత్వమే లక్ష్యం సెయుటాలో ఘోరం..నిత్యం లైంగిక దాడులు గాజా నగరంలో ఇజ్రాయెల్ దాడుల కలకలం ‘సర్దార్ 2’ ట్రైలర్ అదిరిపోయింది.. కార్తీ స్పై మిషన్‌లో హై వోల్టేజ్ యాక్షన్.. ఎస్.జే. సూర్య విలన్‌గా మైండ్ బ్లోయింగ్! ఎంపీ పదవికి బ్రిటన్ మాజీ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా

పేదలకు వైద్య సేవలే లక్ష్యం

Select Suryaa Now
పేదలకు వైద్య సేవలే లక్ష్యం

అయ్యాలూరివారిపల్లిలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ మల్లికార్జున రెడ్డి

పామూరు (సి ఎస్ పురం),  పేద, గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పామూరు రవణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సి ఎస్ పురం మండలంలోని అయ్యాలూరివారిపల్లిలో 42వ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.శిబిరంలో ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న గ్రామస్తులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పేదలకు వైద్య సేవలు అందించడమే తమ సేవా సంకల్పమని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.