BREAKING
ఇరుముడి జోరు చూస్తే రూ.300 కోట్లు ఖాయమేనా? ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్! పేదలకు వైద్య సేవలే లక్ష్యం బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి డేటా సెంటర్ రంగానికి 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పశ్చిమ బెంగాల్‌లో తగ్గిన డెంగ్యూ తీవ్రత సిబిఐ, ఈడీలను భాజపా దుర్వినియోగం చేస్తోంది బాంబే ఆసుపత్రిలో అన్నా హజారే నేపాల్ సైన్యంతో చేయి కలిపిన భారతీయ సహాయక బృందం! అసెంబ్లీ నియమాలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉల్లంఘించారు వరుసగా చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు స్వదేశీకరణ, ప్రపంచ పోటీతత్వమే లక్ష్యం సెయుటాలో ఘోరం..నిత్యం లైంగిక దాడులు గాజా నగరంలో ఇజ్రాయెల్ దాడుల కలకలం ‘సర్దార్ 2’ ట్రైలర్ అదిరిపోయింది.. కార్తీ స్పై మిషన్‌లో హై వోల్టేజ్ యాక్షన్.. ఎస్.జే. సూర్య విలన్‌గా మైండ్ బ్లోయింగ్! ఎంపీ పదవికి బ్రిటన్ మాజీ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా

బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

Select Suryaa Now
బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి


డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్
రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ ను నిరసిస్తూ వికారాబాద్‌లో కాంగ్రెస్ భారీ ర్యాలీ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 01): లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కక్షపూరితంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ, ఉత్తరాఖండ్‌లోని హాల్ద్వానీలో జరిగిన ఘటనకు బాధ్యులైన బీజేపీ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై కక్షపూరితంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజల పట్ల వివక్ష చూపడం హేయమైన చర్య అన్నారు. హాల్ద్వానీ ఘటనకు బాధ్యులైన బీజేపీ కార్యకర్తలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు సంతోష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య, ఏఎంసీ చైర్మన్లు శ్రీనివాస్ ముదిరాజ్, వడ్డే శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, సీనియర్ నాయకులు రఘుపతి రెడ్డి, కిషన్ నాయక్, చిగుళ్లపల్లి రమేష్, మహిపాల్ రెడ్డి, ఉత్తమ్ చంద్, అమీర్ అబ్దుల్లా, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సతీష్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సంతోష, మైనారిటీ సెల్ చైర్మన్ ఖాజా సలావుద్దీన్ హైమద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.