శరవేగంగా ఎత్తిపోతల పనులు... రైతుల్లో ఆశలు
కొడంగల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 2): ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టితో మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గంలో 53,745 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోవడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పంప్హౌస్లు, కాలువలు, ఇతర అనుబంధ పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తయితే కొడంగల్ ప్రాంతంలో సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతులకు నీటి భరోసా కలగనుంది