BREAKING
లక్ష్యాలకు మించి బొగ్గు ఉత్పత్తి, రవాణా సీపీఎస్‌ రద్దు చేసి.. ఓపీఎస్‌ పునరుద్ధరించాలి రిటైర్మెంట్‌ తర్వాత భద్రత కోసం నిరసన 23 డిమాండ్లపై చారిత్రాత్మక ఒప్పందం శరవేగంగా ఎత్తిపోతల పనులు... రైతుల్లో ఆశలు అల్లరి నరేష్ కామెడీ కమ్ బ్యాక్ - రంభా ఊర్వశీ మేనక సెప్టెంబర్ 4న రిలీజ్! మేట్టూరు డ్యామ్ ఓపెన్ చేసిన సీఎం విజయ్ - కావేరీ మా హక్కే అంటూ కర్ణాటకకు వార్నింగ్! NEET గొడవకు సుప్రీం బ్రేక్ - విద్యార్థులపై FIR లు రద్దు - సెప్టెంబర్ 5 ర్యాలీ క్యాన్సిల్ - బాధితులకు పరిహారం బిష్కెక్ లో పాక్ కు మోదీ షాక్ - ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అంటూ వార్నింగ్! తిరుపతి సర్వదర్శనానికి ఎంత టైం పడుతుంది? ఈరోజు సెప్టెంబర్ 2 లేటెస్ట్ అప్డేట్ - వెళ్లే ముందు ఇది తప్పక తెలుసుకోండి! తిరుపతి లేటెస్ట్ అప్డేట్ - సెప్టెంబర్ 2న TTD సంచలన నిర్ణయం - బ్రహ్మోత్సవాల వేళ VIP దర్శనాలు బంద్! ఆంధ్ర & తెలంగాణలో ఈరోజు వెండి ధర - సెప్టెంబర్ 2 - షాకింగ్ డౌన్! తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ - సెప్టెంబర్ 2 కొత్త అప్డేట్ - ధరలు తగ్గాయా, పెరిగాయా? రేగోడ్‌లో ‘వన్ మోర్ టీ’ స్పెషల్ ఆభరణాల ప్రియులకు ఊరట పాలకుర్తి నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన భరత్ సుమన్

సీపీఎస్‌ రద్దు చేసి.. ఓపీఎస్‌ పునరుద్ధరించాలి రిటైర్మెంట్‌ తర్వాత భద్రత కోసం నిరసన

Select Suryaa Now
సీపీఎస్‌ రద్దు చేసి.. ఓపీఎస్‌ పునరుద్ధరించాలి  రిటైర్మెంట్‌ తర్వాత భద్రత కోసం నిరసన

 

సూర్య మందమర్రి:కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సిపిఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపిఎస్)ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం మిగిలిన జీవితాన్ని ఆర్థిక భద్రతతో, ఆనందంగా గడిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సీపీఎస్‌ విధానం వల్ల ఉద్యోగుల పదవీ విరమణ అనంతర జీవితం ఆర్థిక అనిశ్చితికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ, పాత పెన్షన్‌ విధానాన్ని తిరిగి అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్‌ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అదనపు తహసీల్దార్‌ ఆనంద్‌ కుమార్‌, నాయబ్‌ తహసీల్దార్‌ సంతోష్‌ కుమార్‌, రెవెన్యూ ఇన్స్పెక్టర్ (గిర్దావర్‌) అంజన్‌ కుమార్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.