11,993 మంది సురక్షితం.. 3,916 మంది గల్లంతు!
కాఠ్మాండ్: నేపాల్ను ముంచెత్తిన వినాశకరమైన ఆకస్మిక వరదలపై ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా తాజా పరిస్థితులను వెల్లడించారు. వరద ముప్పులో చిక్కుకున్న వేలాది మందిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఇప్పటివరకు రెస్క్యూ బృందాలు 11,993 మంది బాధితులను సురక్షితంగా రక్షించగలిగాయి. నెట్వర్క్, రవాణా వ్యవస్థలు దెబ్బతినడం వల్ల కనీసం 3,916 మందితో ఇప్పటివరకు సంప్రదింపులు జరపలేకపోయామని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. విపత్తు తీవ్రతను పర్యవేక్షించేందుకు మంత్రుల బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది.
ఈ అత్యంత క్లిష్ట సమయంలో భారత్, చైనా, అమెరికాలతో పాటు పలు దేశాలు, విదేశీ బ్యాంకులు నేపాల్ను ఆదుకోవడానికి ముందుకు వచ్చాయని, వాటి మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. బాధితులకు పునరావాసం కల్పించడం, గల్లంతైన వారి ఆచూకీ కనుగొనడమే ప్రస్తుతం తమ ముందున్న ప్రధాన ప్రాధాన్యత అని ప్రధాని స్పష్టం చేశారు.