BREAKING
పరిపాలన, పౌరుల మధ్య ఐఐఎస్ అధికారులు కీలక వారధి భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారంపై సమీక్ష పులుల సంరక్షణకు జీవావరణాన్ని, మానవ అవసరాలను సమతుల్యం చేయాలి ‘భయం నుండి శాంతి వైపు ఛత్తీస్‌గఢ్ పరివర్తనకు ఎయిమ్స్ రాయ్‌పూర్ ప్రతీక’ మరికాసేపట్లో గోదావరి జలాల విడుదల ‘రష్యా గగనతలం పూర్తిగా అసురక్షితం’ ‘సుఖదుఃఖాల్లో భారత్ మా వెంటే’ రైతులు, ఉపాధ్యాయులపై పెండింగ్ కేసులన్నీ రద్దు వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి 420 హామీల ఫ్లెక్సీతో బీఆర్ఎస్ నిరసన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గంగుల కమలాకర్ ధ్వజం కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన.. 'జల హారతి' కార్యక్రమానికి అనకాపల్లి టిడిపి క్యాడర్ ‘ఇన్వెస్ట్ తెలంగాణ’కు రాజ్ నాథ్ సింగ్‌కు ఆహ్వానం 11,993 మంది సురక్షితం.. 3,916 మంది గల్లంతు! వైఎస్సార్‌కు ఘన నివాళులు కేరళలో రొనాల్డో సోదరి ఎల్మా అవేరో సందడి

వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి

Select Suryaa Now
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి

న్యూఢిల్లీ: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ  సాగునీటి ప్రాజెక్టులు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి బృహత్తర అభివృద్ధి పనులతో పాటు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలతో వైఎస్సార్ పాలనపై చెరగని ముద్ర వేశారని స్మరించుకున్నారు. పేదలు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.

ఈ నివాళి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, హర్కర వేణుగోపాల రావుతో పాటు ఎంపీలు ఎం. అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేష్ షెట్కార్, పోరిక బలరామ్ నాయక్ మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని నివాళులర్పించారు.