మరికాసేపట్లో గోదావరి జలాల విడుదల
పాయకరావుపేట సెప్టెంబర్ 2 మేజర్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నేడు పోలవరం ఎడమ కాలువ నుండి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదలకానున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు.మధ్యాహ్నం 2.20 నిమిషాలకు సీఎం పాయకరావుపేట పిఎల్ పురం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.అనంతరం రోడ్డు మార్గం ద్వారా పోలవరం ఎడమ కాలువ ప్రాంతానికి చేరుకుంటారు.జల హారతి గోదావరి జలాల విడుదల కార్యక్రమంలో పాల్గొని అనంతరం 3.30 నిమిషాలకు తిరిగి పి.ఎల్ పురం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటారు.ప్రజలను ఉద్దేశించి సీఎం సభా కార్యక్రమం సాయంత్రం 5.30 వరకు కొనసాగుతుంది. సభా ముగింపు అనంతరం 5.35 నిమిషాలకు సీఎం హెలిపాడ్ వద్దకు చేరుకొని హెలికాప్టర్ లో తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.