BREAKING
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, జైరాం రమేష్‌లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ 286 రోజుల రికార్డు సముద్ర ప్రయాణం తర్వాత థాయ్‌లాండ్‌లో అమెరికా యుద్ధ నౌక 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్' లంగరు దుర్మార్గపు కాంగ్రెస్ పాలనను ప్రజా కోర్టులో ఎండగడతాం ….ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిజిటల్ బీమా, మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రారంభం ఏజెన్సీ కోర్టులకు ఆ అధికారం లేదు *గిరిజనేతరుల ఆస్తుల వివాదాలపై సుప్రీమ్ కోర్టు స్పష్టికరణ * సివిల్ కోర్టులే పరిష్కరించాలని తీర్పు జీ20 సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి భేటీలు హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం.. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ భారీ నిరసన.. ‘జన గంగ’తో ప్రజా ఉద్యమంగా మారిన నదీ పరిరక్షణ సెప్టెంబర్ 3 నుండి ఉక్రెయిన్, పోలాండ్‌లలో విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన పరిపాలన, పౌరుల మధ్య ఐఐఎస్ అధికారులు కీలక వారధి భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారంపై సమీక్ష పులుల సంరక్షణకు జీవావరణాన్ని, మానవ అవసరాలను సమతుల్యం చేయాలి ‘భయం నుండి శాంతి వైపు ఛత్తీస్‌గఢ్ పరివర్తనకు ఎయిమ్స్ రాయ్‌పూర్ ప్రతీక’ మరికాసేపట్లో గోదావరి జలాల విడుదల ‘రష్యా గగనతలం పూర్తిగా అసురక్షితం’

దుర్మార్గపు కాంగ్రెస్ పాలనను ప్రజా కోర్టులో ఎండగడతాం ….ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Select Suryaa Now
దుర్మార్గపు కాంగ్రెస్ పాలనను ప్రజా కోర్టులో ఎండగడతాం  ….ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

 

సూర్య, హుజురాబాద్.
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో అన్ని అవకతవకలేనని, ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి దుర్మార్గపు పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా కోర్టులో బి ఆర్ ఎస్ ఎండగడుతుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సమరభేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు హాజరై మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మభ్యపెట్టడానికి అనేక వాగ్దానాలు చేసి గద్దెనెక్కిందని అన్నారు. గద్దినెక్కిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, ఆరు గ్యారెంటీలు, 420 హామీలు మర్చిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే నాయకుల పై తప్పుడు కేసులు పెడుతూ నిరంకుశ పాలన చేస్తుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ పాలన పై బి ఆర్ ఎస్ పార్టీ సమరభేరీ కార్యక్రమం చేపడుతూ ప్రజలను ప్రజలను చైతన్యవంతం చేస్తుందన్నారు. వారం రోజుల రోజుకు ఒక అంశంపై రోజుకు ఒక మండలంలో ప్రభుత్వ తప్పులను ఎండబెట్టడం పార్టీ చేస్తుందన్నారు. ప్రజలకు గులాబీ పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కోలిపాక శ్రీనివాస్, సింగిల్ విండో అధ్యక్షులు ఎడవెల్లి కొండల్ రెడ్డి, గంద శ్రీనివాస్ తిరుపతిరెడ్డి పింగిలి రమేష్ తదితరులు పాల్గొన్నారు