BREAKING
‘రష్యా గగనతలం పూర్తిగా అసురక్షితం’ ‘సుఖదుఃఖాల్లో భారత్ మా వెంటే’ రైతులు, ఉపాధ్యాయులపై పెండింగ్ కేసులన్నీ రద్దు వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి 420 హామీల ఫ్లెక్సీతో బీఆర్ఎస్ నిరసన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గంగుల కమలాకర్ ధ్వజం కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన.. 'జల హారతి' కార్యక్రమానికి అనకాపల్లి టిడిపి క్యాడర్ ‘ఇన్వెస్ట్ తెలంగాణ’కు రాజ్ నాథ్ సింగ్‌కు ఆహ్వానం 11,993 మంది సురక్షితం.. 3,916 మంది గల్లంతు! వైఎస్సార్‌కు ఘన నివాళులు కేరళలో రొనాల్డో సోదరి ఎల్మా అవేరో సందడి బూటకపు కాంగ్రెస్‌ మాటలు నమ్మొద్దు.. నా హయాంలో రూ.1,680 కోట్లతో అభివృద్ధి పనులు పైలెట్‌ తాండూరులో గర్జించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి 1,114 మృతదేహాలు వెలికితీత..ప్రధాని ప్రకటన సెప్టెంబర్ 24న థియేటర్లలో ప్రళయం - నాని The Paradise బిగ్గెస్ట్ రిలీజ్ - టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే మోస్ట్ అవైటెడ్ మూవీ! Huawei సంచలనం - నేడే ఒకేసారి 5 కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ - Watch GT 7 నుండి MatePad Pro వరకు - Munich లో Chase The Wild ఈవెంట్ లైవ్! కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం యూటర్న్? రంగంలోకి అగ్రనేతలు!

బూటకపు కాంగ్రెస్‌ మాటలు నమ్మొద్దు.. నా హయాంలో రూ.1,680 కోట్లతో అభివృద్ధి పనులు పైలెట్‌ తాండూరులో గర్జించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

Select Suryaa Now
బూటకపు కాంగ్రెస్‌ మాటలు నమ్మొద్దు.. నా హయాంలో రూ.1,680 కోట్లతో అభివృద్ధి పనులు పైలెట్‌  తాండూరులో గర్జించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి



తాండూరు, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 2): గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తాను తాండూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నుంచి రూ.1,680 కోట్ల నిధులు తీసుకొచ్చి వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం తాండూరు పట్టణంలోని ఇందిరాగాంధీ చౌక్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పైలెట్‌ రోహిత్‌రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎన్నికల ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రస్తుతం అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. తాండూరు నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని అన్నారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రజలకు అండగా బీఆర్‌ఎస్‌ పార్టీ నిరంతరం పోరాడుతుందని రోహిత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చెబుతున్న మాటలను ప్రజలు నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.