|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 04:18 PM
ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ డివిజన్కు చెందిన బొబ్బ నవత రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో గౌరవ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన కేటీఆర్ గారికి BRS నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ గారుస్వాగతం పలికారుఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, మహిళల పురోగతి అంటే సమాజ పురోగతి అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ *కోఆర్డినేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు* మాట్లాడుతూ మహిళల విద్య, ఉపాధి మరియు ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి సమాజంలో తమ ప్రతిభను చాటాలని అన్నారు.
అలాగే BRS నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ గారు మాట్లాడుతూ మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ నిర్మాణంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని, మహిళలను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధిని సాధిస్తుందని అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో *శ్రీనివాస్ రెడ్డి గారు, తండ్రి అంజయ్య యాదవ్ గారు, తొంట అంజయ్య యాదవ్ గారు, కుమార్ గౌడ్ గారు, జగన్నాథ్ రెడ్డి గారు, జగదీష్ గారు, చిన్న గారు* తదితరులు పాల్గొన్నారు.