|
|
by Suryaa Desk | Mon, Jul 28, 2025, 07:42 PM
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గోల్కొండలోని ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో చిరుతపులి రోడ్డు దాటుతున్న దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. తారామతి వెనుక భాగం నుంచి మూసీ నది వైపు చిరుత వెళ్లినట్లు గుర్తించారు. ఈ విషయంపై అటవీశాఖ అధికారులు గోల్కొండ పోలీసులకు సమాచారం అందించారు.గత కొన్ని రోజులుగా మంచిరేవుల, నార్సింగి ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం. గ్రేహౌండ్స్ ప్రాంతంలో అధికారులు నాలుగు బోన్లు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే, ఆ చిరుతపులి బోన్లకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది. ప్రస్తుతం ఇబ్రహీంబాగ్ ప్రాంతంలో సంచరిస్తూ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది.