గోవా కోర్టులో లొంగిపోయిన ‘తెహెల్కా’ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ పనాజీ:
‘తెహెల్కా’ పత్రిక మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్పాల్ సోమవారం గోవాలోని మపుసా (Mapusa) కోర్టు ఎదుట లొంగిపోయారు. 2013 నాటి లైంగిక దాడి కేసులో తనకు పడిన శిక్షపై దాఖలు చేసిన అప్పీల్ను విచారించాలంటే ముందుగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన కోర్టులో సరెండర్ అయ్యారు.
2013 నాటి అత్యాచారం, లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన తేజ్పాల్ను కోర్టు ముందు లొంగిపోవాలని ఆగస్టులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. లొంగుబాటు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. సరెండర్ సర్టిఫికెట్ సమర్పించిన తర్వాతే అప్పీల్పై విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
అంతకుముందు, ఆగస్టు 6న బాంబే హైకోర్టు గోవా బెంచ్ తేజ్పాల్ను ఈ కేసులో దోషిగా నిర్ధారిస్తూ 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2013 నవంబర్ 7, 8 తేదీల్లో గోవాలోని ఓ స్టార్ హోటల్ లిఫ్ట్లో తనపై తేజ్పాల్ లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.