ఏఐపీసి చైర్మన్ మధుయాష్కి గౌడ్ ను కలిసిన సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్
ఏఐపీసి చైర్మన్ మధుయాష్కి గౌడ్ ను కలిసిన సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్
తిరుమలగిరి మేజర్ న్యూస్ :- హైదరాబాద్ లోని తన నివాసంలో ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ (ఏఐపీసీ ) చైర్మన్గా నియమితులైన మధుయాష్కి గౌడ్ ను వెలిశాల గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కాలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన పోరాట యోధుడు, కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన సీనియర్ నాయకుడు మధుయాష్కి గౌడ్ అని అన్నారు . ఆయనకు లభించిన ఈ బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఆయనకున్న విశ్వాసానికి, సేవలకు గుర్తింపు అని అన్నారు.రానున్న రోజుల్లో ఆయనకు మరిన్ని ఉన్నతమైన బాధ్యతలు, పదవులు లభించి, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన సేవలు మరింత బలాన్ని చేకూర్చాలని ఆకాంక్షించారు.