వినాయకుని కృపతో ప్రతి అడుగులో విజయాలు చేకూరాలి
వినాయకుని కృపతో ప్రతి అడుగులో విజయాలు చేకూరాలి
శ్రీ సాయి రత్న బ్రిక్స్ ఇండస్ట్రీస్ అధినేత ఓరుగంటి మస్తాన్ రావు
విఘ్నాలను తొలగించే గణనాథుని అనుగ్రహంతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు వెల్లివిరియాలని శ్రీ సాయి రత్న బ్రిక్స్ ఇండస్ట్రీస్ అధినేత ఓరుగంటి మస్తాన్ రావు ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించి, ఆయన ఆశీస్సులతో తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరారు.
పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని మస్తాన్ రావు సూచించారు. మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించడం, రసాయన రంగులకు దూరంగా ఉండటం ద్వారా ప్రకృతిని కాపాడేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. గణనాథుని కృపాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.