పల్లెనిద్రతో ప్రజలకు చేరువగా ఎస్ఐ అనూక్
పల్లెనిద్రతో ప్రజలకు చేరువగా ఎస్ఐ అనూక్
- పల్లె నిద్రలో పాల్గొన్న టిడిపి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడుసుల్లి ప్రభాకర్ చౌదరి
పామూరు, మేజర్ న్యూస్ : మండలంలోని బొట్లగూడూరు గ్రామంలో ఆదివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమాన్ని సబ్ఇన్స్పెక్టర్ అనూక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో రాత్రి బస చేస్తూ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునే దిశగా పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి ఎస్ఐ అనూక్తో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో శాంతిభద్రతల పరిస్థితిని పరిశీలిస్తూ ప్రజలకు పోలీసుల సేవలు మరింత చేరువయ్యేలా చేపడుతున్న చర్యలను పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.
కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కోటపాటి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ ఎర్రగొల్ల బాల, అనపర్తి మహేశ్వరరావు, కోటపాటి రాజా, గూడూరు వెంకటాద్రి, గ్రామస్తులు పాల్గొన్నారు.