BREAKING
తెలంగాణలో మరోసారి వర్షాల హెచ్చరిక.. రేపు ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు మహిళల ఆసియా కప్ ఫైనల్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇనుమడించిన దేశ ఖ్యాతి అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా నెట్టింట చక్కర్లు కొడుతున్న రాజమౌళి-మహేష్ బాబు సినిమా షూటింగ్ లీక్ ఫొటో.. డైలమాలో ఫ్యాన్స్ వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి జావా సముద్రంలో ఫెర్రీ ప్రమాదం.. 6 మంది మృతి ఆర్య వైశ్యులకు అండగా ప్రజా ప్రభుత్వం ఆఫ్రికన్ యూనియన్ ఛైర్‌పర్సన్‌తో ప్రధాని మోదీ భేటీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా నెహ్రూ జూపార్క్‌లో తెల్ల పులి పిల్లను దత్తత తీసుకున్న యువకుడు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసాతో ప్రధాని మోదీ భేటీ నైజీరియా ఉపాధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ ప్రపంచ వ్యాక్సిన్ సరఫరాలో భారత్ అగ్రస్థానం పల్లెనిద్రతో ప్రజలకు చేరువగా ఎస్‌ఐ అనూక్ ‘గణేష్ జ్ఞానార్థి ఎగ్జిబిషన్’ను ప్రారంభించిన అమిత్ షా

వైద్య సేవలను పల్లె ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం

Select Suryaa Now
వైద్య సేవలను పల్లె ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం

వైద్య సేవలను పల్లె ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం

- తలకొండపాడులో 47వ ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన డాక్టర్ మల్లికార్జున రెడ్డి

పీసీపల్లి, (పామూరు), మేజర్ న్యూస్  : గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని రవణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి తెలిపారు. పీసీపల్లి మండలంలోని తలకొండపాడు గ్రామంలో ఆదివారం సాయంత్రం  47వ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పామూరు రవణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి , కనిగిరి పివిఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న పేదలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వైద్య శిబిరాల నిర్వహణను కొనసాగిస్తున్నామని డాక్టర్ మల్లికార్జున రెడ్డి తెలిపారు.