వెంకటాపురంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్* *ప్రతి ఇంటికి మట్టి విగ్రహాన్ని అందజేసిన ఎమ్మెల్యే సునీత, శ్రీరామ్
*
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తన స్వగ్రామం రామగిరి మండలం వెంకటాపురంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి ఇంటికి మట్టి వినాయక విగ్రహాన్ని అందజేశారు. వెంకటాపురం తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ఈ మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి అంటే ఎంతో సందడిగా చేసుకునే పండుగ అని... అయితే ఇటీవల ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వాడటం వల్ల నీటి కాలుష్యం బాగా పెరిగిందన్నారు. దీనిని నివారించేందుకు ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను పూజించాలన్న లక్ష్యంతోనే ఈ విగ్రహాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. పండుగ అన్నది పర్యావరణాన్ని కాపాడే విధంగా ఉండాలన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మట్టి వినాయక విగ్రహాలను గరికతో పూజించాలని... దీనిని ఎవరు మర్చిపోవద్దని సూచించారు. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు వారు ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.....