‘గణేష్ జ్ఞానార్థి ఎగ్జిబిషన్’ను ప్రారంభించిన అమిత్ షా
ముంబై:భారతదేశపు అపారమైన విజ్ఞాన సంప్రదాయాలను పరిరక్షించడం, డిజిటలైజేషన్ చేయడం మరియు విస్తృతంగా వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ముంబై ఏషియాటిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘గణేష్ జ్ఞానార్థి ఎగ్జిబిషన్’ను ఆదివారం ఆయన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశ సంస్కృతి, చరిత్ర మరియు భాషలను కాపాడుకునే సమాజమే సుదీర్ఘకాలం నిలబడుతుందని పేర్కొన్నారు. వలసవాద దృక్పథం నుంచి బయటపడి, భారతీయ విజ్ఞానాన్ని స్వదేశీ కోణంలో పునర్వివరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆసియాటిక్ సొసైటీ వద్ద ఉన్న అరుదైన వ్రాతప్రతులు, ప్రాచీన గ్రంథాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'జ్ఞాన్ భారతం' జాతీయ వ్రాతప్రతుల మిషన్తో అనుసంధానించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పండిట్ పాండురంగ వామన్ కేన్ రచనలతో ‘కేన్ సమగ్ర’ను సంకలనం చేసి భవిష్యత్ తరాలకు అందుబాటులోకి తేగలగాలని సూచించారు.