ఎల్లంపేట మున్సిపల్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి
మేడ్చల్, మేజర్ న్యూస్: మేడ్చల్ మండల ప్రజలకు, ఎల్లంపేట మున్సిపల్ ప్రజలకు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. వినాయక చవితి పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.