BREAKING
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తిరుమల జి ఎన్ సి టోల్గేట్ వద్ద చిరుత కలకలం కార్గిల్ యుద్ధ వీరుడుపై ఇనుపరాడితో దాడి విఘ్నాలను తొలగించి.. విజయాలను అందించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ, పవిత్రమైన "వినాయక చవితి" సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఐపీసి చైర్మన్ మధుయాష్కి గౌడ్ ను కలిసిన సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ వినాయకుని కృపతో ప్రతి అడుగులో విజయాలు చేకూరాలి కళాకారుల బతుకులతో ఆటలాడుతున్న... కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం-గిలకత్తుల రమెష్ గౌడ్ యాసిడ్ దాడిలో గాయపడిన వివాహిత చికిత్స పొందుతూ మృతి మల్లేనిపల్లి వినాయక చవితి కి రూ. 10,116 విరాళం అందజేసిన టిడిపి నేత చంద్ర * పరిటాల శ్రీరామ్ సూచనలతో ఆర్థిక సాయం వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి తునిలో అంతుచిక్కని అదృశ్యం: వంద రోజులు గడిచినా దొరకని చిన్నారి ఆచూకీ నేటి నుంచి గణేష్ నవరాత్రులు ప్రారంభం: భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలు నేడు వినాయక చవితి.. కొలువుదీరనున్న గణనాథుడు…. - విగ్రహాల ప్రతిష్ఠకు వాడవాడలా ముస్తాబైన మండపాలు… - తొమ్మిది రోజులు పూజలందుకోనున్న గణనాథుడు…. వినాయక చవితి పూజా విధానం: విఘ్నేశుడికి ప్రీతికరమైన 21 పత్రాలు ఇవే! విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రైతు కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి

కార్గిల్ యుద్ధ వీరుడుపై ఇనుపరాడితో దాడి

Select Suryaa Now
కార్గిల్ యుద్ధ వీరుడుపై ఇనుపరాడితో దాడి

హరియాణాలోని గురుగ్రామ్‌లో ఘటన
ఇనుప రాడ్‌తో కొట్టడంతో తల, చేతికి తీవ్ర గాయాలు
దాడి చేసిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్
పోలీసులు, ఆసుపత్రి సిబ్బందిపైనా బాధితుడి ఆరోపణలు
పార్కింగ్ విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఓ కార్గిల్ యుద్ధ వీరుడిపై దాడికి దారితీసింది. పార్కింగ్ అటెండెంట్ ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో భారత వైమానిక దళ మాజీ అధికారి, 'ఆపరేషన్ సఫేద్ సాగర్'లో పాల్గొన్న గ్రూప్ కెప్టెన్ అమిత్ కుమార్ గుప్తా (రిటైర్డ్) తీవ్రంగా గాయపడ్డారు. హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగిందీ ఘటన.

గుప్తా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, గురువారం రాత్రి ఆయన తన కుటుంబంతో కలిసి డిన్నర్ కోసం మాగ్నమ్ గ్లోబల్ పార్క్‌లోని గొంజో రెస్టారెంట్‌కు వెళ్లారు. కారు పార్క్ చేసేందుకు ప్రయత్నించగా, అక్కడి సిబ్బంది ఒకచోట నుంచి మరోచోటకు పంపుతూ ఇబ్బంది పెట్టారని, చివరకు పార్కింగ్‌కు నిరాకరించారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో కారును రివర్స్ చేస్తుండగా ఒక అటెండెంట్ కారు విండ్‌షీల్డ్‌పై కొట్టాడు. దీనిపై ప్రశ్నించేందుకు వాహనం దిగిన తనపై ఆ అటెండెంట్ ఇనుప రాడ్‌తో తల, చేతిపై బలంగా కొట్టాడని, చంపేస్తానని బెదిరించాడని గుప్తా వివరించారు.

తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్నా అక్కడి సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బంది ఎవరూ వెంటనే స్పందించలేదని గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసినా, దాదాపు 30 నిమిషాల వరకు ఎవరూ రాలేదని తెలిపారు. చివరకు రెస్టారెంట్‌లోని ఓ చెఫ్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగిందని, అనంతరం అంబులెన్స్‌లో తనను మేదాంత ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ఈ దాడిలో తన తలకి, మోచేతికి తీవ్ర గాయాలయ్యాయని, సర్జరీ చేసి మోచేతికి ప్లేట్లు అమర్చారని గుప్తా వెల్లడించారు.

ఆసుపత్రి తన మెడికో-లీగల్ రిపోర్టులో గాయాలను సరిగా నమోదు చేయలేదని కూడా ఆయన ఆరోపించారు. నిందితుడిపై హత్యాయత్నం, తీవ్రంగా గాయపరిచినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 1999లో కార్గిల్ సెక్టార్‌లో పాక్ చొరబాటుదారులను తరిమికొట్టేందుకు భారత వైమానిక దళం చేపట్టిన మిషన 'ఆపరేషన్ సఫేద్ సాగర్'.