టీడీపీ కార్యకర్త నెట్టెం కేశవ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేసిన పరిటాల శ్రీరామ్
ధర్మవరం
ధర్మవరం పట్టణ పరిధిలోని శాంతినగర్కు చెందిన తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్త నెట్టెం కేశవ ఇటీవల అకాల మరణం చెందారు. సమాచారం అందుకున్న పార్టీ అధిష్ఠానం, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి అండగా నిలిచింది.
ఇందులో భాగంగా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ఈ రోజు కేశవ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ కార్యకర్తల ప్రమాద బీమా పథకం కింద మంజూరైన రూ. 5 లక్షల విలువైన బీమా పరిహార పత్రాన్ని (చెక్) వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ... పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కేశవ మృతి పార్టీకి తీరని లోటని, వారి కుటుంబ బాధ్యతను పార్టీ చూసుకుంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.