BREAKING
జమ్మూ కాశ్మీర్‌లో 10 బ్రాండ్ల నెయ్యి విక్రయాలపై నిషేధం రక్షణ రంగ ఎగుమతుల్లో డీపీఎస్‌యూల సంచలనం అమెరికాలో ఇక ‘లేక్ అమెరికా’గా ప్రదర్శించనున్న గూగుల్ మ్యాప్స్ నేపాల్ వరద బాధితులకు యూఏఈ భారీ ఊరట ప్రకటనలే గాని పింఛన్లు లేవు..! రుద్రారంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం రసమయి వ్యాఖ్యలపై ద్యావ శ్రీనివాస్ రెడ్డి ఫైర్ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో సీఎస్‌ఆర్ నిధుల వినియోగం శివార్లలో గల్లీగల్లీకీ రోడ్లు, డ్రెయిన్లు అత్యాచార నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి నేపాల్ వరదల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణ ఆర్మేనియా ప్రధానితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు నష్టం గ్రామీణ సమస్యల పరిష్కారంపై సిపిఎం ధర్నా నత్త నడకన మూసీ బ్రిడ్జి నిర్మాణం

నేపాల్ వరద బాధితులకు యూఏఈ భారీ ఊరట

Select Suryaa Now
నేపాల్ వరద బాధితులకు యూఏఈ భారీ ఊరట

83 టన్నుల అత్యవసర సహాయ సమగ్రం రవాణా
అబుదాబి: ఇటీవల సంభవించిన భీకర వరదలు, కొండచరియలు విరిగిపడటంతో అతలాకుతలమైన నేపాల్‌ను ఆదుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కొండంత అండగా నిలిచింది. యూఏఈ ఎయిడ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో 83 టన్నుల ఆహార ధాన్యాలు, నివాస వసతికి సంబంధించిన ఆశ్రయ సామాగ్రి, అత్యవసర మానవతా సహాయ రవాణా వస్తువులతో కూడిన ప్రత్యేక విమానాన్ని నేపాల్‌కు పంపింది.

నేపాల్‌లో సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గాయపడటం, గల్లంతవ్వడం జరిగింది. ఈ క్లిష్ట సమయంలో బాధితులను ఆదుకోవడానికి యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తక్షణమే స్పందించి 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ.83 కోట్లకు పైగా) సహాయాన్ని ప్రకటించారు. ఆ ఆదేశాల అమలులో భాగంగానే మొదటి విడతగా ఈ సహాయ సామాగ్రిని తరలించారు.

నేపాల్‌లోని యూఏఈ రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ, బాధితులకు మరియు ప్రభావిత ప్రాంతాలకు సహాయక సామాగ్రి వేగంగా చేరేలా యూఏఈ ఎయిడ్ ఏజెన్సీ స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తోంది. దీంతో పాటు అంతర్జాతీయ సహాయక సంస్థలతో కూడా కలిసి సహాయక చర్యలను మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.