అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు నష్టం
సూర్య వీణవంక,
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని వాగుపై 2021లో నిర్మించిన చెక్డ్యామ్ కరకట్ట సరిగా నిర్మించకపోవడంతో వర్షాలకు కరకట్ట కొట్టుకుపోయి సుమారు 10 ఎకరాల పంట భూములు దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. పంట పొలాల్లో గండ్లు ఏర్పడి సాగుకు పనికిరాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించి, భూములను చదును చేయాలని కోరుతూ రైతులు ప్రజావాణిలో దరఖాస్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్, మండల కార్యదర్శి పిల్లి రవి యాదవ్ పాల్గొన్నారు.