BREAKING
రుద్రారంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం రసమయి వ్యాఖ్యలపై ద్యావ శ్రీనివాస్ రెడ్డి ఫైర్ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో సీఎస్‌ఆర్ నిధుల వినియోగం శివార్లలో గల్లీగల్లీకీ రోడ్లు, డ్రెయిన్లు అత్యాచార నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి నేపాల్ వరదల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణ ఆర్మేనియా ప్రధానితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు నష్టం గ్రామీణ సమస్యల పరిష్కారంపై సిపిఎం ధర్నా నత్త నడకన మూసీ బ్రిడ్జి నిర్మాణం రూ.500 కోట్ల ఆయిల్‌ఫెడ్ భూమి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం కొండా సురేఖ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం పెళ్లి మండపంలో రచ్చ కార్మిక హామీలు అమలు చేయాలి వనమహోత్సవంతో పాఠశాలలో పచ్చదనం

కొండా సురేఖ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం

Select Suryaa Now
కొండా సురేఖ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం

ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖ పార్టీ మారడంపై వస్తున్న ప్రచారాల నడుమ బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ బీజేపీలోకి వస్తే తాము సాదరంగా ఆహ్వానిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఆమె రాజకీయ ప్రస్థానంపై ఎలాంటి అవినీతి మరకలు లేవని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. కొండా సురేఖపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని కారణంగా, ఆమె పార్టీలోకి రావడాన్ని బీజేపీలో ఎవరూ వ్యతిరేకించరని ఆయన పేర్కొన్నారు. కొండా సురేఖ దంపతులకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆమె లాంటి ప్రజాదరణ ఉన్న నాయకులు పార్టీలోకి రావడం స్వాగతించదగిన పరిణామమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుండగా, ధర్మపురి అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.