కొండా సురేఖ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం
ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖ పార్టీ మారడంపై వస్తున్న ప్రచారాల నడుమ బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ బీజేపీలోకి వస్తే తాము సాదరంగా ఆహ్వానిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఆమె రాజకీయ ప్రస్థానంపై ఎలాంటి అవినీతి మరకలు లేవని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. కొండా సురేఖపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని కారణంగా, ఆమె పార్టీలోకి రావడాన్ని బీజేపీలో ఎవరూ వ్యతిరేకించరని ఆయన పేర్కొన్నారు. కొండా సురేఖ దంపతులకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆమె లాంటి ప్రజాదరణ ఉన్న నాయకులు పార్టీలోకి రావడం స్వాగతించదగిన పరిణామమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుండగా, ధర్మపురి అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.