కార్మిక హామీలు అమలు చేయాలి
బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు టైగర్ కృష్ణయ్య
వికారాబాద్, మేజర్ న్యూస్ (ఆగస్టు 31):కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు టైగర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు.సెప్టెంబర్ 2 నుంచి 10 వరకు జిల్లావ్యాప్తంగా కార్మికుల ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. ఆశా, అంగన్వాడీ, మున్సిపల్, విద్యుత్, ఆటో, భవన నిర్మాణ, ఆర్టీసీ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ తదితర రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని టైగర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు.