శివార్లలో గల్లీగల్లీకీ రోడ్లు, డ్రెయిన్లు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్ ప్రతినిధి ….కరీంనగర్ను అభివృద్ధిలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. 45వ డివిజన్ మంకమ్మతోటలో రూ.70 లక్షల యూఐడీఎఫ్ నిధులతో డ్రెయిన్ పైప్లైన్, సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నగరంలో రూ.630 కోట్లతో మోడల్ రోడ్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్, జంక్షన్ల అభివృద్ధి చేపడతామన్నారు. రూ.130 కోట్లతో 80 కి.మీ. మేర స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, రూ.80 కోట్లతో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు, 130 ఎలక్ట్రిక్ వాహనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.