ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో సీఎస్ఆర్ నిధుల వినియోగం
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా
న్యూఢిల్లీ: ఢిల్లీ సచివాలయంలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా పాల్గొన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం మరియు నగర అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం, పలు ప్రముఖ ప్రైవేట్ సంస్థల మధ్య కీలక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.
ఈ సందర్భంగా సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ప్రైవేట్ రంగ భాగస్వామ్యం తోడైతేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సీఎస్ఆర్ నిధుల ద్వారా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతుల కల్పన వంటి ప్రధాన రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ ఒప్పందం ఎంతో దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన ప్రైవేట్ సంస్థలకు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.