BREAKING
రుద్రారంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం రసమయి వ్యాఖ్యలపై ద్యావ శ్రీనివాస్ రెడ్డి ఫైర్ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో సీఎస్‌ఆర్ నిధుల వినియోగం శివార్లలో గల్లీగల్లీకీ రోడ్లు, డ్రెయిన్లు అత్యాచార నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి నేపాల్ వరదల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణ ఆర్మేనియా ప్రధానితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు నష్టం గ్రామీణ సమస్యల పరిష్కారంపై సిపిఎం ధర్నా నత్త నడకన మూసీ బ్రిడ్జి నిర్మాణం రూ.500 కోట్ల ఆయిల్‌ఫెడ్ భూమి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం కొండా సురేఖ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం పెళ్లి మండపంలో రచ్చ కార్మిక హామీలు అమలు చేయాలి వనమహోత్సవంతో పాఠశాలలో పచ్చదనం

నత్త నడకన మూసీ బ్రిడ్జి నిర్మాణం

Select Suryaa Now
నత్త నడకన మూసీ బ్రిడ్జి నిర్మాణం

రేవంత్ రెడ్డి అసమర్థతకు ఇది నిదర్శనం!
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరు నత్త కూడా సిగ్గుపడేలా ఉందంటూ సామాజిక మాధ్యమాలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూసీ నదిపై ఒక చిన్న బ్రిడ్జి నిర్మాణాన్నే ఏళ్ల తరబడి సాగదీస్తూ ప్రజాధనాన్ని, సమయాన్ని వృథా చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

సెప్టెంబర్ 2023లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మూసారంబాగ్ వద్ద మూసీ నదిపై రెండు వైపులా కలిపి ఆరు లేన్ల నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే, తాజాగా (ఆగస్టు 30, 2026 నాటికి) కేవలం ఒకవైపు ఉన్న మూడు లేన్ల బ్రిడ్జి నిర్మాణం మాత్రమే పూర్తయింది. అంటే మూడేళ్ల సుదీర్ఘ కాలంలో రేవంత్ ప్రభుత్వం కేవలం సగం బ్రిడ్జిని మాత్రమే పూర్తి చేయగలిగింది.

తెలంగాణకు మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి పాలనా అసమర్థతకు ఈ సగం పూర్తయిన బ్రిడ్జియే ప్రత్యక్ష సాక్ష్యమని విమర్శకులు ధ్వజమెత్తుతున్నారు. మూసీ నదిపై ఒక చిన్న బ్రిడ్జిలోని సగభాగాన్ని నిర్మించడానికే మూడేళ్ల సమయం తీసుకున్న ఈ ప్రభుత్వం, ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో మూసీ నదిని మొత్తం సుందరీకరిస్తామని చెబుతున్న మాటలను ప్రజలు ఎలా నమ్ముతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.