రసమయి వ్యాఖ్యలపై ద్యావ శ్రీనివాస్ రెడ్డి ఫైర్
సూర్య–మానకొండూర్: మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలను మానకొండూర్ మండల అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పేదల కోసం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ‘మార్కెటింగ్’గా విమర్శించడం తగదన్నారు. శిబిరంలో 400 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, 30 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయించామని తెలిపారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అప్పుడప్పుడు ప్రెస్మీట్లకే పరిమితమవుతున్నారని రసమయిపై విమర్శలు చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారంటూ విమర్శించే నైతికత రసమయికి లేదన్నారు.