BREAKING
రుద్రారంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం రసమయి వ్యాఖ్యలపై ద్యావ శ్రీనివాస్ రెడ్డి ఫైర్ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో సీఎస్‌ఆర్ నిధుల వినియోగం శివార్లలో గల్లీగల్లీకీ రోడ్లు, డ్రెయిన్లు అత్యాచార నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి నేపాల్ వరదల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణ ఆర్మేనియా ప్రధానితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు నష్టం గ్రామీణ సమస్యల పరిష్కారంపై సిపిఎం ధర్నా నత్త నడకన మూసీ బ్రిడ్జి నిర్మాణం రూ.500 కోట్ల ఆయిల్‌ఫెడ్ భూమి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం కొండా సురేఖ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం పెళ్లి మండపంలో రచ్చ కార్మిక హామీలు అమలు చేయాలి వనమహోత్సవంతో పాఠశాలలో పచ్చదనం

రూ.500 కోట్ల ఆయిల్‌ఫెడ్ భూమి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం

Select Suryaa Now
రూ.500 కోట్ల ఆయిల్‌ఫెడ్ భూమి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం

హరీష్ రావు తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఆయిల్‌ఫెడ్‌కు చెందిన రూ.500 కోట్ల విలువైన విలువైన భూమిపై సీఎం రేవంత్ రెడ్డి కన్ను పడిందని, దానిని ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా అప్పగిస్తున్నారని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై ఆయన రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఆర్టీసీ బస్ భవన్ ఎదురుగా ఉన్న ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (ప్లాట్ నం.1)లో 3.5 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం గజం రూ.2 లక్షలు (మొత్తం రూ.500 కోట్లు) ఉంటుందని హరీష్ రావు తెలిపారు. అయితే, పరిశ్రమల శాఖ ఈ భూమిని గజం కేవలం రూ.56 వేల చొప్పున మొత్తం రూ.87 కోట్లకే ప్రైవేటు పరం చేయడానికి నిర్ణయించడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లుతోందని మండిపడ్డారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు కూడా సమాచారం లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. సొంత ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్‌ఫెడ్ ఆ స్థలానికి రూ.87 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, దానిని పక్కనపెట్టి మరీ ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టడం వెనుక ఉన్న అసలు మర్మమేంటని ప్రశ్నించారు.

వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఆయిల్‌ఫెడ్ భూమిని ఆ సంస్థకే కేటాయించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే బిఆర్‌ఎస్ పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.