నేపాల్ వరదల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణ
భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ పరామర్శ
కాఠ్మండు (నేపాల్): నేపాల్లోని రసువా జిల్లా చిలిమే గ్రామంలో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న ముగ్గురు భారతీయ పౌరులతో పాటు వారి నేపాలీ సహోద్యోగిని నేపాల్ సైన్యం సురక్షితంగా రక్షించింది. రక్షించబడిన వారిని నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ ప్రత్యక్షంగా కలుసుకుని, వారి సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు.
సకాలంలో స్పందించి తమ పౌరులను ప్రాణాపాయం నుండి కాపాడిన నేపాల్ ఆర్మీకి భారత రాయబార కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది. బాధితులు క్షేమంగా భారతదేశానికి తిరిగి వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ ఏర్పాట్లను నేపాల్లోని భారత ఎంబసీ వేగవంతం చేస్తోంది.