andhrapradesh
సీఎం చంద్రబాబును కలిసిన జర్నలిస్టుల ప్రతినిధులు
సీఎం చంద్రబాబును కలిసిన జర్నలిస్టుల ప్రతినిధులు
విశాఖలో జరగనున్న ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ఐదో మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించాలని వినతి
సూర్య, స్టేట్ బ్యూరో : విశాఖపట్నంలో త్వరలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీయూడబ్ల్యూజేఎఫ్) ఐదో మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై మహాసభలను ప్రారంభించాలని కోరుతూ ఫెడరేషన్ ప్రతినిధి వర్గం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా మహాసభల వివరాలను సీఎంకు తెలియజేసి, ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించింది.
ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్. వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రతినిధి వర్గం ముఖ్యమంత్రిని కలిశారు. ఫెడరేషన్ ముఖ్య నాయకులు పి. హుస్సేన్ ఖాన్, కే. కలిమి శ్రీ, వై. దయానంద్ తదితరులు ఉన్నారు.