రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సర్వీస్ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పిన ద్విచక్రవాహనం
కీసర, మేజర్ న్యూస్, సెప్టెంబరు 3:
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వినాయకనగర్కు చెందిన ఎం. అరుణ (24) కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది.
గురువారం మేడ్చల్లో పని ముగించుకుని భర్త మురళితో కలిసి ద్విచక్రవాహనంపై నేరేడ్మెట్కు తిరుగు ప్రయాణమయ్యారు. వారితో పాటు పొరుగున ఉండే మరో వ్యక్తి కూడా అదే వాహనంపై ప్రయాణిస్తున్నాడు. అరుణ వాహనం వెనుక కూర్చుంది.
షామీర్పేట డీఆర్డీఏ సమీపంలోని సర్వీస్ రోడ్డుపై అకస్మాత్తుగా స్పీడ్ బ్రేకర్ రావడంతో ద్విచక్రవాహనం అదుపుతప్పింది. దీంతో అరుణ వెనుకకు ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.