BREAKING
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నినదిస్తే అరెస్టులా? కరీంగూడాలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట మహిళా ప్రధానాంశంతో తెరకెక్కిన ‘హ్యాపీ జర్నీ’ సినిమా రిలీజ్ డేట్ ఖరారు: సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరహా చిత్రం ‘డెలులు’: సెప్టెంబర్ 3న టీజర్ విడుదల తెలంగాణలో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ: జిల్లాల వారీగా కొత్త నోటిఫికేషన్ల వెలువరింపు ఆదిలాబాద్, మామ్నూర్ విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం గంజాయి రహిత జిల్లా లక్ష్యంగా పటిష్ట చర్యలు. సుమారు 3 కోట్ల విలువైన 600 కేజీల భారీ గంజాయి పట్టివేత. ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్. అధికారులకు, సిబ్బందికి రివార్డులు అందజేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. కమల్ హాసన్, ఎస్.యు. అరుణ్ కుమార్ క్రేజీ ప్రాజెక్ట్: వైరల్‌గా మారిన లుక్ టెస్ట్ గ్లింప్స్ తెలంగాణ టూరిజానికి భారీ బూస్ట్.. రూ.22,324 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: మంత్రి కందుల ఖైరతాబాద్ బడా గణేష్ 2026: 69 అడుగుల ఎత్తులో అభయమివ్వనున్న 'పంచముఖ సంకటహర మహా గణపతి'! ‘రుద్రవీణ’ స్ఫూర్తితో ‘బాలు’ పాత్రను తీర్చిదిద్దుకున్నా: నటుడు అక్షయ్ లగుసాని రేషన్ సరుకుల పంపిణీ గడువు సెప్టెంబర్ 5 వరకు పొడిగింపు 'ప్రేమనే ఊరిలో' చిత్రం నుంచి ‘ఏరై పారే హృదయం’ మెలోడీ సాంగ్ విడుదల! అంబేద్కర్‌పై అవహేళనకు పాల్పడితే సహించం. డీబీపీ జాతీయ అధ్యక్షుడు కృష్ణస్వరూప్

ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నినదిస్తే అరెస్టులా?

Select Suryaa Now
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నినదిస్తే అరెస్టులా?

ఫీజు రీయింబర్స్మెంట్ సాధన కోసం వెనకడుగు వేసేది లేదు.

ప్రభుత్వ నియంతృత్వ వైఖరిపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ధ్వజం

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
రాష్ట్రంలోని లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న ఈ ప్రభుత్వం, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగితే పోలీసులతో అణచివేసే ప్రయత్నం చేయడం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ రోజు సెక్రటేరియట్ వద్ద శాంతియుతంగా సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థులు సంతకాలు చేసిన ప్రతులను అందించడానికి బీజేవైఎం నాయకులకు మద్దతుగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక శాసనసభాపక్ష నేత అని కూడా చూడకుండా పోలీసులు అక్రమంగా, అమానుషంగా ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస, నియంతృత్వ పాలనకు పరాకాష్టగా మారిందన్నారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే కనీసం స్పందించే తీరిక లేకపోవడం ఈ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం అని, ఒక ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా అరెస్టు చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న నియంతృత్వ, రాక్షస పాలనకు అద్దం పడుతోందన్నారు. పోలీసుల నిర్బంధాలు, అక్రమ అరెస్టులకు భయపడి విద్యార్థుల పక్షాన మేము చేసే పోరాటాన్ని ఆపేది లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే తన మొండి వైఖరిని వీడి, అరెస్టయిన మా నాయకులను బేషరతుగా విడుదల చేయాలనీ, అలాగే, పెండింగ్‌లో ఉన్న 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విద్యార్థులకు చెల్లించాలని లేనిపక్షంలో, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల పక్షాన ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.