telanagana
రేషన్ సరుకుల పంపిణీ గడువు సెప్టెంబర్ 5 వరకు పొడిగింపు
సూర్య కరీంనగర్ ప్రతినిధి:
ఆహార భద్రత కార్డుదారులకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 2026 నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను ముందస్తుగా కేటాయించినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి తెలిపారు. ఋతుపవనాలు, వర్షాకాలంలో రేషన్ సరుకుల రవాణాలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో మూడు నెలలకు సంబంధించిన రేషన్ సరుకుల పంపిణీ గడువును అదనంగా సెప్టెంబర్ 5, 2026 వరకు పొడిగించినట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని రేషన్ కార్డుదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను సెప్టెంబర్ 5లోగా తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి కోరారు.